సాక్షి,హైదరాబాద్: మూసాపేట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, ప్రమాదం జరిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోలేదని తెలుస్తోంది. ప్రమాదం తీవ్రతతో ఎగిసిపడుతున్న మంటలకు స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణ భయంతో ప్రమాద ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.



