TS: ఒకేసారి మూడు నెలల సన్న బియ్యం పంపిణీ | Filters Shorts Now Playing Central Govt To Distribute 3 Months Ration Rice In Telangana, More Details Inside | Sakshi
Sakshi News home page

TS: ఒకేసారి మూడు నెలల సన్న బియ్యం పంపిణీ

May 27 2025 11:12 AM | Updated on May 27 2025 12:50 PM

Filters  SHORTS Now playing Central Govt To Distribute 3 Months Ration Rice In One Go In June

జూన్‌ ఒకటి నుంచి 30వరకు సరఫరా

ఐదు జిల్లాల నుంచి బియ్యం దిగుమతి 

ప్రతి నెలా ఇచ్చేది 5,782 మెట్రిక్‌ టన్నులు 

మూడు నెలల కోటాకు 17 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం

 స్టాక్‌ నిల్వకు గోదాముల కొరత

వికారాబాద్‌: ఒకేసారి మూడు నెలల(జూన్, జూలై, ఆగస్టు)కు సంబంధించిన రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ ఒకటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మన రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో వచ్చే సమస్యలను అధిగమించి మూడు నెలల కోటా ఒకేసారి ఇచ్చేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఈ విషయమై కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్, అడిషనల్‌ కలెక్టర్‌(రెవెన్యూ) లింగ్యానాయక్‌ పౌరసరఫరాల శాఖ అధికారులతో చర్చించారు. అనంతరం క్షేత్రస్థాయి అధికారులు, డీలర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. పంపిణీలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సాధారణంగా నెలలో 15 రోజులు మాత్రమే బియ్యం పంపిణీ చేసేవారు.. ప్రస్తుతం ఒకేసారి మూడు నెలల కోటా ఇస్తున్నందున డువుతో సంబంధం లేకుండా లబి్ధదారులు తీసుకెళ్లే వరకు పంపిణీ చేయాలని నిర్ణయించారు.  

సమస్యలను అధిగమిస్తేనే.. 
ప్రభుత్వం మూడు నెలల రేషన్‌ బియ్యం ఒకే నెలలో పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో పలు సమస్యలు ఎదురుకానున్నాయి. గతంలో కోవిడ్‌ సమయంలో మాత్రమే ఒకేసారి రెండు నెలల కోటా ఇచ్చారు. ప్రస్తుతం జిల్లాలో ఒకటి లేదా రెండు నెలల కోటాను పంపిణీ చేసేందుకు మెకానిజం ఉండగా మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేయాలంటే మాత్రమే పలు సమస్యలను అధిగమించాల్సి ఉంది. కోటా నిల్వకు సరిపడా గోదాములను సమకూర్చుకోవాల్సి ఉంది. 

ఇదే సమయంలో గ్రామాల్లో డీలర్ల దగ్గర కూడా మూడు నెలల కోటా ఒకే సారి నిల్వ చేయటానికి సరపడా స్థలాలు లేకపోవటం కూడా సమస్య కానుంది. అయితే ఇతర జిల్లాల నుంచి వచి్చన బియ్యం వచ్చినట్టు గ్రామాలకు చేరవేయటం ద్వారా గోదాముల కొరతను అధిగమించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటిలాగే నెలలో 15రోజులు కాకుండా నెల మొత్తం బియ్యం పంపిణీ చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement