సాక్షి, నిజామాబాద్: బొందలగడ్డలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ కన్న తండ్రి అత్యంత పాశవికానికి ఒడిగట్టాడు. ముక్కుపచ్చలారని తన రెండేళ్ల కుమారుడు ప్రేమ్ని అత్యంత దారుణంగా గొంతు కోసి హతమార్చాడు. బాబు తనకు పుట్టలేదనే అనుమానంతోనే కుమారున్ని హత్య చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.


