
ఆస్తులు తిరిగి ఇప్పించాలని వృద్ధ దంపతుల మొర
హనుమకొండ అర్బన్: ‘కుమారుడితో సహజీ వనం చేస్తున్న మహిళ మాకు అన్నం పెట్టమంటే చెప్పుతో కొడుతోంది’ అని ఓ వృద్ధ దంపతులు సోమ వారం హనుమకొండ కలెక్టరే ట్లో జరి గిన గ్రీవెన్స్లో కలెక్టర్కు మొరపెట్టు కున్నారు. ఈ మేరకు వారిని ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు వెల్లడించారు. ‘నా పేరు ఊడత కొమురమ్మ, భర్త పేరు సమ్మ య్య. మాది పరకాల మండలం సీతారాంపూర్ గ్రామం. మాకు ఇద్దరు కొడుకులు.
వారసత్వంగా వచ్చిన భూమిని 1.30 ఎకరాల చొప్పున ఇద్దరికీ సమానంగా పంచాము. కుల పెద్దల సమక్షంలో మాట్లాడుకున్నప్పుడు మమ్మల్ని జీవితాంతం సాదాలని చెప్పారు. కానీ, పిల్లలు ఆస్తి తీసుకున్నాక మా ఆలనాపాలనా చూడటం లేదు. ఒక కొడుకుకు ఇబ్బందుల కారణంగా మూడు పెళ్లిళ్లు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మా కోడలు అన్నం పెట్టమంటే చెప్పుతో కొడుతోంది. మాకు తిండి పెట్టని కొడుకులకు మా ఆస్తి ఎందుకివ్వాలి. అందుకే అధికారులకు విన్నవిస్తున్నాం.. మా ఆస్తిని మా పేర్ల పైకి మార్చండి. మా ఆలనాపాలనా చూసుకున్న వారికి మా తదనంతరం ఆస్తి చెందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.