దసరా ఎఫెక్ట్:‍ హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ

Due to Dussehra Heavy Traffic At Toll Plazas And On Highways - Sakshi

చౌటుప్పల్‌ రూరల్, బీబీనగర్‌: దసరా పండుగ నేపథ్యంలో  హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవు దినం కావడంతో, శనివారం ఉదయం నుంచే వాహనాల్లో బయలుదేరారు. దీంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై, హైదరాబాద్‌–వరంగల్‌ రహదారిపై రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్‌ ప్లాజాలకు వాహనాల తాకిడి విపరీతమైంది. సరాసరి రోజుకు 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుండగా, శనివారం మరో 5వేల వాహనాలు అదనంగా వెళ్లాయి. పోలీసులు కూడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: Hyderabad: సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top