టోల్‌ ప్లాజాలకు ‘దసరా’ వాహనాల తాకిడి.. కిలోమీటర్ల మేర..! | Due to Dussehra Heavy Traffic At Toll Plazas And On Highways | Sakshi
Sakshi News home page

దసరా ఎఫెక్ట్:‍ హైవేలపై పెరిగిన వాహనాల రద్దీ

Oct 2 2022 9:33 AM | Updated on Oct 2 2022 3:02 PM

Due to Dussehra Heavy Traffic At Toll Plazas And On Highways - Sakshi

ఆదివారం సెలవు దినం కావడంతో, శనివారం ఉదయం నుంచే వాహనాల్లో బయలుదేరారు.

చౌటుప్పల్‌ రూరల్, బీబీనగర్‌: దసరా పండుగ నేపథ్యంలో  హైదరాబాద్‌– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవు దినం కావడంతో, శనివారం ఉదయం నుంచే వాహనాల్లో బయలుదేరారు. దీంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై, హైదరాబాద్‌–వరంగల్‌ రహదారిపై రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్‌ ప్లాజాలకు వాహనాల తాకిడి విపరీతమైంది. సరాసరి రోజుకు 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుండగా, శనివారం మరో 5వేల వాహనాలు అదనంగా వెళ్లాయి. పోలీసులు కూడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: Hyderabad: సీఎం కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Advertisement
 
Advertisement
Advertisement