TG: ఫౌండేషన్‌ పేరుతో భారీ మోసం.. ప్లాట్స్‌ ఇస్తామని 540 కోట్లు.. | Dhanwantari Foundation International Fraud In Telangana | Sakshi
Sakshi News home page

TG: ఫౌండేషన్‌ పేరుతో భారీ మోసం.. ప్లాట్స్‌ ఇస్తామని 540 కోట్లు..

Jul 8 2024 5:57 PM | Updated on Jul 8 2024 6:35 PM

Dhanvantari Foundation Fraud In Telangana

సాక్షి, హైదరాబాద్: ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో తెలంగాణలో భారీ మోసం జరిగింది. ఫౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపించి భారీ మొత్తంలో డబ్బులు దండుకున్నారు. తాజాగా ఇది మోసమని తేలడంతో బాధితులకు పోలీసులను ఆశ్రయించారు.

వివరాల ప్రకారం..‘ధన్వంతరి ఫౌండేషన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్వాహకులు కమలాకర్‌ శర్మ బాధితులను కోరారు. పెట్టుబడులకు అధిక వడ్డీ ఇస్తామని వారిని మభ్యపెట్టారు. ఈ క్రమంలోనే పెట్టుబడులు పెట్టిన వారికి ప్లాట్స్‌ ఇస్తామని ఆశ చూపించారు. ఇలా దాదాపు నాలుగు వేల మంది దగ్గర సుమారు రూ.540 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఇక, బాధితులందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్హం.

ఇక, తాజాగా బాధితులందరూ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలో బాధితుల ఫిర్యాదుతో సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీసీఎస్‌ డీసీపీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. కమలాకర్‌ శర్మను అరెస్ట్‌ చేసి ధన్వంతరి ఫౌండేషన్‌ పేరు మీద ఉన్న ఆస్దులను సీసీఎస్‌కు అటాచ్‌ చేసినట్టు తెలిపారు. అలాగే సీజ్‌ చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు డిపాజిట్లు చేసిన డబ్బులు వచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement