-
నగరవాసికి 'జపాన్' జాబ్ కలకలం! బెంగళూరు జపాన్ ఎంబసీలో ఆరా తీయగా.. బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: జపాన్లో ఉద్యోగం ఉందంటూ నగరవాసిని నట్టేట ముంచారు సైబర్ నేరస్తులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.29.27 లక్షలు కొట్టేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మూసాపేటకు చెందిన యువతి గత జులైలో ఆన్లైన్లో ఉద్యోగం కోసం వెతకగా.. ఓ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ నుంచి ఈ–మెయిల్ వచ్చింది. జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమోటివ్ ఉపకరణాల తయారీ సంస్థలో సీనియర్ అకౌంట్స్ మేనేజర్ ఉద్యోగం ఉందని మెయిల్ సారాంశం. ఆగస్టు నెలలో కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న కోజిన్ నాకాకిత బాధితురాలిని ఆన్లైన్లో ఇంటర్వ్యూ చేశాడు. ఆ మర్నాడు ఉదయం ఆమె మెయిల్కు కంపెనీ నుంచి జాబ్కు సెలెక్ట్ అయ్యావంటూ జీతభత్యాలు, బెనిఫిట్స్తో కూడిన ఆఫర్ లెటర్ వచ్చింది. అయితే డాక్యుమెంటేషన్, జీఎస్టీ ఇతరత్రా చార్జీల కోసం రూ.33,780 డిపాజిట్ చేయాలని ప్రతినిధులు సూచించడంతో.. నిజమేనని నమ్మిన ఆమె సొమ్మును బదిలీ చేసింది. ఆ తర్వాత కొద్ది సేపటికి పెట్టుబడుల మీద 40 శాతం బోనస్తో కలిపి వస్తాయని ఆశ చూపించడంతో రూ.29,27,780 పెట్టుబడులు పెట్టింది. జీ–20 సదస్సుతో క్యాన్సిల్ అంటూ.. ఢిల్లీలో జపాన్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం ఉంటుందని బాధితురాలిని నమ్మించారు. రోజులు గడుస్తున్నా మీటింగ్ ఖరారు కాకపోవడంతో ఆరా తీయగా.. ఢిల్లీలో జీ–20 సమావేశాల నేపథ్యంలో మీటింగ్ వాయిదా పడిందని మాయమాటలు చెప్పారు. ఈసారి సమావేశం బెంగళూరులో అక్టోబర్ నెలలో ఉంటుందని చెప్పారు. ఈ సమావేశం కూడా జరగకపోవడంతో అనుమానం వచ్చిన బాధితురాలు బెంగళూరులోని జపాన్ ఎంబసీలో ఆరా తీయగా.. అసలు విషయం తెలిసి ఖంగుతింది. అసలు సదరు జపాన్ కంపెనీ ఎలాంటి రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టలేదని తెలిసింది. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్స్లో ఫిర్యాదు చేసింది. ఇవి చదవండి: సినీ నిర్మాత కోసం.. సీసీఎస్ వేట! అసలేం జరిగిందంటే? -
సుధా మూర్తి పేరిట మోసం.. పోలీసులకు ఫిర్యాదు
ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, రచయిత్రి సుధా మూర్తి బెంగళూరు పోలీసుల్ని ఆశ్రయించారు.రెండు వేర్వేరు ఘటనల్లో తన పేరును ఉపయోగించి లావణ్య, శ్రుతి అనే పేరుతో ఇద్దరు మహిళలు మోసాలకు పాల్పడ్డారంటూ ఆమె తరఫున తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మమత సంజయ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మమత సంజయ్ ఫిర్యాదు మేరకు .. 2023 ఏప్రిల్ 5న సుధా మూర్తికి ఓ ఈమెయిల్ వచ్చింది. కన్నడ కూట ఆఫ్ నార్తన్ కాలిఫోర్నియా (కేకేఎన్సీ) సంఘం 50వ వార్షికోత్సవానికి అధితులుగా రావాలనేది ఆ మెయిల్ సారాంశం. అయితే అదే నెల ఏప్రిల్ 26న ఆ మెయిల్కు సుధా మూర్తి ఆఫీస్ ప్రతినిధులు స్పందిస్తూ.. బిజీ షెడ్యూల్ వల్ల కేకేఎన్సీ ఈవెంట్కు రాలేరని సమాధానం ఇచ్చారు. సుధా మూర్తి పర్సనల్ అసిస్టెంట్గా కానీ ఆగస్టు 30న మూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారంటూ ఫొటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుధా మూర్తి కేకేఎన్సీ నిర్వాహకుల నుంచి వివరాల్ని సేకరించారు. ఈ సందర్భంగా తాను సుధామూర్తి పర్సనల్ అసిస్టెంట్గా పరిచయం చేసుకున్న లావణ్య అనే మహిళ ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తేలింది. అంతేకాదు ఆమె పలువురిని నుంచి నగదు వసూలు చేసినట్లు తేలింది. ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు అమెరికాలో ‘మీట్ అండ్ గ్రీట్’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి సుధా మూర్తి హాజరవుతున్నారంటూ శ్రుతి అనే మరో మహిళ ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లావణ్య, శ్రుతి పేరుతో మోసం చేసిన వారిపై సుధా మూర్తి వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ మోసానికి పాల్పడిన మహిళలు ఎక్కడ ఉన్నారనేది తెలియాల్సి ఉంది. ఇక ఆ ఇద్దరు మహిళలపై ఐపీసీ-419 (మోసం), 420, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్-66(సి), 66(డి) సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఘరానా మోసం.. పెట్రోల్ బంకుల్లో కొన్నేళ్లుగా చిప్ దందా.. లీటర్కు బదులు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో పెట్రోల్ బంక్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. కొందరు బంక్ యజమానులు ఎలక్ట్రానిక్ చిప్లతో తక్కువ పెట్రోల్ పోస్తూ వాహనదారుల జేబులకు గండికొడుతున్నారు. తాజాగా, నగరంలోని పలు బంకుల్లో ఎస్వోటీ టీమ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో కొందరు బంక్ యజమానులు చిప్ అమర్చి లీటర్కు రూ.10 గండి కొడుతున్నట్టు గుర్తించారు. వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నట్టు కనుగొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ చీకటి దందా జరుగుతున్నట్టు తెలుసుకున్నారు. ఈ క్రమంలో వారిని గట్టిగా విచారించడంతో నగరవ్యాప్తంగా పలు బంకుల్లో చిప్లు అమర్చినట్టు నిందితులు వెల్లడించారు. -
సోకుల కోసం కంపెనీ సొమ్మును వాడేసింది!
ఫిన్టెక్ రంగంలో భారత్పే సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అయితే గత కొంతకాలంగా ఈ కంపెనీ సహ వ్యవస్థాపకుడు.. మేనేజింగ్ డైరెక్టర్ అష్నీర్ గ్రోవర్, ఆయన సతీమణి మాధురీ మీద అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అష్నీర్ను సెలవుల మీద పంపించి.. అంతర్గత విచారణ ద్వారా ఆయన్ని తప్పించేందుకు ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తాజాగా కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. అష్నీర్కు తాజాగా గట్టి షాక్ ఇచ్చింది భారత్పే. ఆయన భార్య మాధురీ జైన్ను కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. అంతేకాదు ఆమె పేరిట కంపెనీలో ఉన్న వాటాను సైతం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ కంట్రోలర్ హోదాలో ఆర్థికపరమైన అవకతవకలకు మాధురి పాల్పడినట్లు నిర్ధారణ అయిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. మాధురీ జైన్.. కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు, దుస్తులు, ఎలక్ట్రిక్ సామాన్లు, అమెరికా.. దుబాయ్కి ఫ్యామిలీ ట్రిప్స్ వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అల్వరెజ్ అండ్ మార్షల్ కంపెనీ నిర్వహించిన దర్యాప్తులో ఈ ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యాయి. ఫేక్ ఇన్వాయిస్లతో కంపెనీని ఆమె మోసం చేయాలని ప్రయత్నించినట్లు తేలింది. ఇదిలా ఉండగా.. అష్నీర్ గ్రోవర్ ఆరోపణలన్నింటిని ఖండిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాను కంపెనీని వీడాలంటే.. తన వాటాగా ఉన్న 4 వేల కోట్ల రూపాయలు తన ముందు పెట్టాలని ఆయన ఇన్వెస్టర్లను డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తన నాయకత్వంలోనే కంపెనీ ముందుకెళ్లాలని చెప్తున్నాడు. ఇదిలా ఉండగా.. సుమారు 3 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత్పే కంపెనీ.. మరో 18 నెలల్లో ఐపీవోకు వెళ్లే యోచనలో ఉంది. ఈ లోపు ఈ ఆరోపణలతో వార్తల్లో నిలుస్తుండడం విశేషం. సంబంధిత వార్తలు: భర్తతో కలిసి బండబూతులు తిట్టిన మాధురీ! -
ఆన్లైన్ లోన్ తీసుకుంటే తప్పవు తిప్పలు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కృషి విజ్ఞాన కేంద్రంలో స్వర్ణోత్సవం
పాఠశాలలు తెరిచే నాటికి పనుల పూర్తి
అక్రమ రవాణా అడ్డుకట్టకు చర్యలు
కేటీపీఎస్ గేమ్స్ సెక్రటరీగా టి.మహేశ్
అప్పుడూ ఇప్పుడూ 'అంతే'
మనమే అభివృద్ధి చేసుకుందాం..
సకుటుంబ సపరివార సమేతం
బీటీపీఎస్ కీర్తి ప్రతిష్టలు పెంచాలి
వంద కేజీల గంజాయి స్వాధీనం
పీహెచ్సీలో డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీ
తప్పక చదవండి
- బ్లూచిప్స్కు అమ్మకాల షాక్
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement