ఎల్‌బీనగర్‌‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ | Devireddy Sudeer Reddy Tested Coronavirus Positive | Sakshi
Sakshi News home page

ఎల్‌బీనగర్‌‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

Aug 8 2020 11:05 AM | Updated on Aug 8 2020 11:10 AM

Devireddy Sudeer Reddy Tested Coronavirus Positive - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా ఎల్‌బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబసభ్యులకు, పనిమనిషికి కరోనా టెస్టులు నిర్వహించారు. ఎమ్మెల్యే భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. వైద్యుల సలహా మేరకు ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు హోం క్వారంటైన్‌లో ఉన్నారు. (తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు)

ఇక రాష్ర్టంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 77,513కి చేరింది. మృతుల సంఖ్య 615కి పెరిగింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 54,330కు చేరగా.. ప్రస్తుతం ప్రస్తుతం తెలంగాణలో 22,568 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement