బంగారం అక్రమ రవాణా 

Customs Officials Seized 975 Grams Of Gold At Shamshabad Airport - Sakshi

శంషాబాద్‌: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మంగళవారం  రాత్రి మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడిని తనిఖీ చేశారు. మలద్వారంలో బంగారం తీసుకొచ్చినట్లు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా 975 గ్రాముల బంగారాన్ని బయటికి తీశారు. బంగారం విలువ రూ. 50.7 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top