గోల్కొండలో ‘పంద్రాగస్టు’కు ఏర్పాట్లు: సీఎస్‌ 

CS Somesh Kumar Arrangements For Independence Day Celebrations At Golconda - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను ఈ నెల 15న చారిత్రక గోల్కొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల ఏర్పాట్లను శుక్రవారం సాయంత్రం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కార్యక్రమ వివరాలను వెల్లడించారు.

15వ తేదీ ఉదయం 10.30 గంటలకు గోల్కొండ వేదికగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. జాతీయ పతాకానికి గౌరవంగా నేషనల్‌ సెల్యూట్‌ ఉంటుందని, దీనికి ముందు ముఖ్యమంత్రి పోలీస్‌ గౌరవవందనం స్వీకరిస్తారని చెప్పారు. ఈ సందర్భంగా దాదాపు వెయ్యిమంది కళాకారులు స్వాగతం పలుకుతారన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top