
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. రేపు(మంగళవారం) చేవెళ్లలో ప్రియాంక గాంధీ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం రెండు స్కీంలను ప్రారంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
రూ.500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ స్కీమ్లను ప్రియాంక గాంధీ చేతులమీదగా ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రియాంక గాంధీ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. అయితే.. అనివార్య కారణాల వల్ల ప్రియాంక గాంధీ పర్యటన రద్దు అయింది.