నిజామాబాద్‌లో ఘోర ప్రమాదం.. కొండగట్టు అంజన్న సన్నిధికి వెళ్తూ..

Collision Between Lorry And Car In Nizamabad Few Killed - Sakshi

సాక్షి, నిజమాబాద్‌: నిజామాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారులో కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్తుండగా... ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో అక్కడకక్కడే ముగ్గురు మృతి చెందారు.

ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా చేపూర్‌ జాతీయ రహదారి పై చోటు చేసుకుంది. మృతులంతా నందిపేట మండలానికి చెందిన వారని అధికారులు చెబుతున్నారు. బాధితులు మంద మోహన్‌, మాదిగ రమేష్‌, ఉమ్మెడ అశోక్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: గుట్టలు గుల్ల.. సర్కారు లీజు గోరంత.. తవ్వుకునేది గుట్టంతా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top