Dussehra: కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు | CM KCR Pooja Nalla Pochamma Temple Pragathi Bhavan | Sakshi
Sakshi News home page

Dussehra: కుటుంబ సమేతంగా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

Oct 15 2021 5:46 PM | Updated on Oct 15 2021 9:23 PM

CM KCR Pooja Nalla Pochamma Temple Pragathi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు ప్రగతి భవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్దంగా వాహన పూజ, అయధపూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement