'ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు'.. బస్సు మీ ఊరికి వస్తోంది | Sakshi
Sakshi News home page

'ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు'.. బస్సు మీ ఊరికి వస్తోంది

Published Thu, Jan 6 2022 1:13 AM

Bus Facility For Hajipur Students In Yadadri Bhuvanagiri District - Sakshi

బొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్‌కు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తుండటంపై ‘ఇక్కడింకా నడుస్తూనే ఉన్నారు’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ మెయిన్‌లో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. ఆర్టీసీ కుషాయిగూడ డిపో మేనేజర్‌ సుధాకర్, యాదగిరిగుట్ట డిపో మేనేజర్‌ లక్ష్మారెడ్డి బుధవారం హాజీపూర్‌ గ్రామంతో పాటు మోడల్‌ స్కూల్‌ను సందర్శించారు.

ఈసీఐఎల్‌ నుంచి బొమ్మలరామారం మండల కేంద్రం వయా మల్యాల గ్రామం నుంచి హాజీ పూర్‌కు బస్సు ఆరు ట్రిప్పులు నడుస్తోందని, హాజీపూర్‌ విద్యార్థుల సౌకర్యం కోసం ధర్మారెడ్డి గూడెం చౌరస్తా నుంచి మోడల్‌ స్కూల్‌కు బస్సు నడిపిస్తామన్నారు. ఎస్‌ఐ వెంకన్నతో పాటు షీ టీమ్‌ బృందం ఎస్‌ఐ మారుతి, కానిస్టేబుళ్లు అనిల్, పార్వతి మోడల్‌ స్కూల్‌ విద్యార్థినులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఆకతాయిలను గుర్తించి వారి వాహనాల నంబర్లను అందజేయాలని కోరారు. మోడల్‌ స్కూల్‌ పరిసరాలలో పెట్రోలింగ్‌ జరుగుతుందని, మరింత నిఘా పెంచుతామని చెప్పారు. ఆపద సమయంలో 100 నంబర్‌కు ఫోన్‌ చేయాలని విద్యార్థినులకు సూచించారు.

Advertisement
Advertisement