హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని.. | BTech Student Life Ends In Road Incident In Sircilla, More Details Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో బీటెక్‌ విద్యార్థిని..

Oct 14 2025 11:51 AM | Updated on Oct 14 2025 12:11 PM

btech student ends life in road incident

సిరిసిల్ల: హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సి రిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సు భాష్‌నగర్‌కు చెందిన బండారి అశోక్‌–గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూ తురు బండారి మనోజ్ఞ(22) హైదరాబాద్‌లో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతోంది. ఇటీవల దసరా పండుగకు ఇంటికొచ్చి వెళ్లిన మనోజ్ఞ హైదరాబాద్‌ వనస్థలిపురంలో శనివారం స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. 

కారు డ్రైవర్‌ తాగిన మైకంలో ఉన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను యశోద ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మరణించింది. మనోజ్ఞ మృతదేహాన్ని సిరిసిల్లకు తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. బంగారు భవిష్యత్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం సిరిసిల్లలో విషాదం నింపింది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement