డెంగీతో బాలుడి మృతి  | Boy Passed Away Due To Dengue Fever In Mahabubabad District | Sakshi
Sakshi News home page

డెంగీతో బాలుడి మృతి 

Aug 22 2021 2:44 AM | Updated on Aug 22 2021 2:44 AM

Boy Passed Away Due To Dengue Fever In Mahabubabad District - Sakshi

జర్పుల మోహన్‌ (ఫైల్‌)

మరిపెడ రూరల్‌: మహబూబాబాద్‌ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోరిగూడెంలో డెంగీ సోకడంతో శనివారం ఓ బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన జర్పుల వీరన్న, కవిత దంపతుల కుమారుడు మోహన్‌ (14)కు 20 రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానికంగా ఓ ఆర్‌ఎంపీకి చూపించారు. అయినప్పటికి జ్వరం తగ్గకపోవడంతో 18న ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడికి పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా నిర్ధారించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు. అయితే హైదరాబాద్‌కు తరలించేలోపే మోహన్‌ చనిపోయాడు. బాలుడు మహబూబాబాద్‌లో 10వ తరగతి చదువుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement