సాక్షి, హైదరాబాద్: ఎల్లారెడ్డిగూడలో విషాదం జరిగింది. అపార్ట్మెంట్ లిఫ్ట్లో ఇరుక్కుపోయి బాలుడు మృతి చెందాడు. ఎల్లారెడ్డిగూడ కీర్తి అపార్ట్మెంట్లో ఘటన జరిగింది. లిప్ట్ డోర్ తెరిచి లోపలికి వెళ్లే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు లిఫ్ట్లో ఇరుక్కుపోయి బాలుడు మరణించాడు.
ఏపీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి కీర్తి అపార్ట్మెంట్స్ ఐదో అంతస్తులో నివసిస్తున్నారు. మృతుడు మధురానగర్లోని ఓ పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నాడు. ఇవాళ సాయంత్రం(నవంబర్ 19, బుధవారం) సాయంత్రం స్కూల్ నుంచి తల్లి, అన్నతో కలిసి ఇంటికి వచ్చిన బాలుడు లిఫ్ట్లో ఐదో అంతస్తుకు చేరుకున్నాడు. తిరిగి కిందకి దిగే సమయంలో లిప్ట్ డోర్ తెరిచి లోపలికి వెళ్లే ప్రయత్నంలో బాలుడు లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు.
బాలుడి కేకలు వేయడంతో అపార్ట్మెంట్ వాసులు వెంటనే అక్కడికి చేరుకుని బయటకు తీశారు. అప్పటికే బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


