
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఆషాఢ మాసం బోనాల వేడుకలు ఈ నెల 26న గోల్కొండ తొలి బోనంతో ప్రారంభమవుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని డాక్టర్ ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆషాఢ మాసం బోనాల పండుగకు సంబంధించి అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి ఆయన మాట్లాడుతూ జూన్ 26న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో తొలి బోనంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.
అనంతరం జులై 1న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం, 13న ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర, 14న రంగం, 20న అక్కన్న మాదన్న బోనాల జాతర, లాల్ దర్వాజా బోనాలు జరుగుతాయన్నారు. జులై 24న బోనాల పండుగ ముగుస్తుందన్నారు. నెల రోజుల పాటు జరిగే ఆషాఢ మాసం బోనాల పండుగ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. బోనాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం 28 ప్రధాన దేవాలయాలకు పట్టు వ్రస్తాలు సమరి్పస్తుందని, ఇందులో మంత్రులు పాల్గొంటారని, 19 దేవాలయాల్లో ఈఓలు, దేవాలయ శాఖ అధికారులు ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమరి్పస్తారన్నారు. అగి్నమాపక శాఖ అధికారులు ముందుగా దేవాలయాలను సందర్శించి ప్రణాళిక రూపొందించుకుని ఫైరింజన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆర్టీసీ అదనపు బస్సులు నడపాలన్నారు. 700 మంది కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఉంటాయన్నారు.