రూ.180 కోట్ల మెడికల్‌ బిల్లులు క్లియర్‌ | Bhatti Clears Rs 180 Crore Pending Medical Bills Of Employees And Pensioners | Sakshi
Sakshi News home page

రూ.180 కోట్ల మెడికల్‌ బిల్లులు క్లియర్‌

Jun 27 2025 5:15 AM | Updated on Jun 27 2025 5:15 AM

Bhatti Clears Rs 180 Crore Pending Medical Bills Of Employees And Pensioners

రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటికీ మోక్షం

26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట

ఉద్యోగులు మా కుటుంబ సభ్యులు: ఉపముఖ్యమంత్రి భట్టి

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉ న్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బిల్లులకు మోక్షం కలిగింది. ఈ బిల్లుల చెల్లింపునకు సంబంధించి రూ.180.38 కోట్లను గురువారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ ఉరట లభించినట్లయింది. రైతు భరోసా కింద రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన వెంటనే ఉద్యోగులకు 2023 మార్చి నుంచి ఈనెల 20 వరకు వచ్చిన మెడికల్‌ బిల్లులన్నింటినీ చెల్లించడం విశేషం.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను ఒక్కొక్కటిగా ప్రభుత్వం పరిష్కరిస్తోందన్నా రు. ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలను పెంచుతూ ఈనెల 13న ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నా రు. డీఏ పెంపుతో రాష్ట్రంలోని 3.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, మూడు లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరిందన్నారు.

డీఏ పెంపుతో ప్రభుత్వంపై ప్రతినెలా రూ. 200 కోట్ల లెక్కన ఏడాదికి రూ. 2,400 కోట్ల భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికా రుల సమస్యల పరిష్కారానికి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు ప్రక్రియ తుది దశకు చేరుకుందని, జనాభాను అనుసరించి గ్రామపంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజి స్తున్నామన్నారు. వీటితోపాటు ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఆరోగ్య బీమా పథకం పూర్తిస్థాయిలో సిద్ధమవు తోందని వెల్లడించారు. వివిధ శాఖల్లో ప్రమోషన్లకు సంబంధించిన డీపీసీల ఏర్పాటు వేగవంతమైందని చెప్పారు. కేవలం రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలోని 7.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు పరిష్కారం కావ డంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement