దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్ల ప్రదానం  | Awarding Certificates To Dalit Journalists | Sakshi
Sakshi News home page

దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్ల ప్రదానం 

Mar 28 2022 4:58 AM | Updated on Mar 28 2022 9:54 AM

Awarding Certificates To Dalit Journalists - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మీడియా అకాడమి, షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి.. శిక్షణకు హాజరైన దళిత జర్నలిస్టులకు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుని రాణించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ, ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్, టీయూడబ్ల్యూజే (హెచ్‌143) ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement