ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదు
హైదరాబాద్: గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయత్ర సందర్భంగా రాజాసింగ్ ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎస్ఐ వీరబాబు ఫిర్యాదు చేశారు. దాంతో అఫ్జల్గంజ్ పీఎస్లో రాజాసింగ్పై కేసు నమోదు చేశారు.
శ్రీరామ నవమి సందర్భంగా తన కొడుకుని పరిచయం చేసే కార్యక్రమంలో ఇతర కమ్యూనిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాజాసింగ్పై 153-A, 506 IPC సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
సంబంధిత వార్తలు