ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు | ACB Court Opposes MLA Sandra Venkata Veeraiah Discharge Petition | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సండ్రకు ఏసీబీ కోర్టులో చుక్కెదురు

Nov 2 2020 2:47 PM | Updated on Nov 2 2020 8:37 PM

ACB Court Opposes MLA Sandra Venkata Veeraiah Discharge Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది.  ఓటుకు నోటు కేసు నుంచి తనను తొలగించాలన్న సండ్ర వెంకట వీరయ్య అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. సోమవారం సండ్ర డిశ్చార్జి పిటిషన్‌తో పాటు, ఉదయ్‌ సింహ పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది. కాగా, ఓటుకు కోట్లు పొలిటికల్ స్కాంలో వీరయ్య చాలా కీలకంగా వ్యవహరించారన్న అభియోగంతో ఏసీబీ కోర్టు ఆయనను గతంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చదవండి : అమరావతి ఉద్యమం కథ,స్క్రీన్‌ప్లే బాబుదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement