
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ పీహెచ్డీ ప్రవేశ పరీక్ష–2025కు 4800 మంది అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగా రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గడువు సమీపిస్తున్నందున అర్హులైన అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
మార్చి చివరి వారం నుంచి ప్రారంభమయ్యే పీహెచ్డీ ప్రవేశ పరీక్షల కోసం.. మార్చి 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. యూజీసీ నెట్, సెట్, జేఆర్ఎఫ్ అభ్యర్థులు కూడా ఓయూ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్సైట్ చూడాలని సూచించారు.