మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి | Fire Accident Minister prashanth reddy Visit | Sakshi
Sakshi News home page

పటాకులు పేల్చిన్రు.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి

Jun 8 2023 4:47 PM | Updated on Jun 8 2023 4:48 PM

Fire Accident Minister prashanth reddy Visit - Sakshi

చీమలపాడు ఘటన మరువక మునుపే.. అలాంటి పరిస్థితులను.. 

సాక్షి, నిజామాబాద్: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. భీంగల్ మండలం పురానిపెట్ గ్రామంలో ఊరుర చెరువుల పండగకు ఆయన హాజరు అయ్యారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. 

బాణాసంచా భారీ సంఖ్యలో పేల్చడంతో.. అవి కాస్త పక్కనే ఉన్న టెంట్‌పై పడ్డాయి. ఆ ప్రభావంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే.. స్థానికులు సత్వరమే స్పందించి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌లో ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడు బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా.. బాణాసంచాతో పెను ప్రమాదమే జరిగింది. అగ్ని ప్రమాదం.. దానికి కొనసాగింపుగా సిలిండర్లు పేలడంతో నలుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. 

Advertisement
 
Advertisement
Advertisement