వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధం.. భర్తను హత్య చేసిన భార్య అరెస్ట్‌

Jun 19 2023 9:40 AM | Updated on Jun 19 2023 9:43 AM

హత్యకు గురైన భర్త భారతితో నిందితుడు   - Sakshi

హత్యకు గురైన భర్త భారతితో నిందితుడు

తమిళనాడు: తంజావూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను పోలీసులు అరెస్టు చేశారు. తంజావూరు జిల్లా తిరుపనందాల్‌ పక్కనే ఉన్న కిల్మందూర్‌ పాత వీధికి చెందిన భారతి (35) చెందిన చైన్నెలోని ఓ హోటల్‌లో టీ మాస్టర్‌గా పనిచేశాడు. అతనికి భార్య దివ్య (27) ఉంది. అతను మే 16న కీలుమందూరుకు వచ్చిన భారతి తిరిగి చైన్నె వెళ్లలేదు.

బంధువులు, స్నేహితులు 10 రోజులుగా పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. భారతి సోదరి భర్త సెల్వమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అతని మొబైల్‌ ఫోన్‌ సంభాషణలపై నిఘా పెట్టారు. అతని భార్య దివ్య అదే పట్టణంలోని ఆర్జే నగర్‌కు చెందిన సతీష్‌కుమార్‌ అలియాస్‌ డేవిడ్‌ (38)తో తరచూ మాట్లాడుతున్నట్టు గుర్తించారు.

ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సతీష్‌కుమార్‌తో దివ్యకు వివాహేతర సంబంధం ఉందని, వారికి భారతి అడ్డుగా ఉండడంతో గొంతుకోసి హత్య చేసి అనంతరం మృతదేహాన్ని పట్టం గ్రామంలోని నది వంతెనపై నుంచి పడేసినట్టు తేలింది. దీంతో దివ్య, డేవిడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement