రూపారెడ్డి హత్యను ఖండిస్తూ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

రూపారెడ్డి హత్యను ఖండిస్తూ ర్యాలీ

Aug 22 2026 2:23 AM | Updated on Aug 22 2026 2:23 AM

సూర్యాపేట : నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపాల్‌ రూపారెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ యునైటెడ్‌ ట్రస్మా, తెలంగాణ ప్రైవేట్‌ టీచర్‌ అండ్‌ లెక్చరర్స్‌ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రుల తరువాతి స్థానం గురువదని, అలాంటి గురువును హత్య చేయడం దారుణమన్నారు. ఉపాధ్యాయులకు రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్‌ ట్రస్మా ప్రతినిధులు హరి, ఆర్‌.ప్రకాష్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, శ్రీనివాసనాయుడు, భిక్షపతి, రమేష్‌, లింగారెడ్డి, అజయ్‌కుమార్‌, ఉపేందర్‌రావు, నరసింహారావు, సోమరాజు, బాలకృష్ణ, రాజశేఖర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement