సూర్యాపేట : లయన్స్ కంటి ఆస్పత్రి చైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త, సుధాకర్ పీవీసీ ఎండీ మీలా మహదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లయన్స్ ఆస్పత్రిలో ఆయన చైర్మన్గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు పోతు భాస్కర్లు పాల్గొని మీలా మహదేవ్ను సన్మానించారు. అదేవిధంగా లయన్స్ ఐ హాస్పిటల్ కార్యదర్శిగా పెండెం చంద్రశేఖర్, కోశాధికారిగా చిలుముల సునీల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా తోట శ్యామ్ ప్రసాద్, కక్కిరేణి చంద్రశేఖర్, పోలబోయిన నర్సయ్య, సంయుక్త కార్యదర్శి ఈగ దయాకర్ గుప్త, ఈసీ సభ్యులుగా నూక వెంకటేశం గుప్తా, భోనగిరి భాస్కర్, చల్లా లక్ష్మీకాంత్, బెలిదె అంజయ్య, మిర్యాల సుధాకర్, కుమ్మరికుంట్ల లింగయ్య, ఆరె సురేష్ రెడ్డి, పటేల్ నర్సింహా రెడ్డి, రాచకొండ శ్రీనివాస్, ధర్మారావు, గౌరవ సలహా దారులుగా గుణగంటి రాములు, గుడిపూడి వెంకటేశ్వర రావు, మొరిశెట్టి లక్షాదిలను ఎన్నుకున్నారు.


