గణతంత్ర వేడుకలకు వేళాయే..
భానుపురి (సూర్యాపేట) : గణతంత్ర వేడుకలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. సూర్యాపేటలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 9 గంటలకు నిర్వహించే వేడుకలకు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు.అనంతరం జిల్లా ప్రగతి నివేదికపై ప్రసంగించనున్నారు. ఆ తరువాత స్వాతంత్య్ర సమర యోధులకు సన్మానం, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రశంస పత్రాల ప్రదానం, స్టాళ్ల సందర్శన ఉంటుంది.
పోలీసుల రిహార్సల్
సూర్యాపేటటౌన్ : పోలీసు పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకల ఏర్పాట్లతో పాటు పోలీసుల రిహార్సల్ను ఎస్పీ నరసింహ పరిశీలించారు. వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, పరేడ్ కమాండర్గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ వ్యవహరిస్తారని ఎస్పీ పేర్కొన్నారు.


