నేడు అఖిలపక్ష సమావేశం
సూర్యాపేట : కర్ల రాజేష్ మృతికి కారకులైన వారిపై సీబీఐతో విచారణ జరపాలనే డిమాండ్తో శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ కోరారు. గురువారం సూర్యాపేటలోని ఖమ్మం రోడ్లోని అమ్మ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మంద కృష్ణమాదిగ హాజరుకానున్నఈ సమావేశానికి అఖిలపక్షల నాయకులంతా రావాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్ మాదిగ, ఎంఎస్పీ నాయకులు సొట్ట నరేందర్ మాదిగ, బచ్చలకూర వెంకటేశ్వర్లు మాదిగ, జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజయ్య మాదిగ, చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, కొమ్ము శేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.


