● మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం 1.45గంటలకు చిట్యాలకు చేరుకున్నారు.
● రోడ్ షోలో 27 నిమిషాలు మాట్లాడారు.
● ఎన్నికల ప్రచార వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేసిన కేటీఆర్.. ఇళ్లపై నిలబడి నినాదాలు చేస్తున్న వారికి ‘జాగ్రత్త కింద పడుతారు’ అంటూ సైగలు చేశారు.
● పలువురు నాయకులు, కార్యకర్తలు ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు.
● కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో చిరుమర్తి లింగయ్య నాయకత్వం వర్థిల్లాలి అంటూ యువకులు నినాదాలు చేస్తుండగా.. నేను కూడా చిరుమర్తి లింగయ్య కోసమే వచ్చానని మంత్రి అన్నారు.
● కేటీఆర్ చిట్యాలలో రోడ్ షోలో వాహనంపైకి ఎక్కగానే వాహనం పైభాగంలో రెలియింగ్ను క్షుణ్ణంగా పరిశీలించారు.
● యువకులు డీజే పాటలకు డాన్స్లు చేశారు. వారితో పాటు చిరుమర్తి లింగయ్య సైతం డాన్స్ చేశారు.
● రోడ్ షోలో పాల్గొన్న పలువురి పర్సులను దొంగలు చోరీ చేశారు.
– చిట్యాల
Comments
Please login to add a commentAdd a comment