అగ్నివీర్‌ కుటుంబానికి అండగా... | - | Sakshi
Sakshi News home page

అగ్నివీర్‌ కుటుంబానికి అండగా...

Aug 30 2026 1:45 AM | Updated on Aug 30 2026 1:45 AM

అగ్నివీర్‌ కుటుంబానికి అండగా...

జి.సిగడాం(పొందూరు): మండలంలోని మజ్జిలపేట గ్రామానికి చెందిన మొజ్జాడ అసిరినాయుడు, వరలక్ష్మి దంపతుల కుమారులు మొజ్జాడ విష్ణుమూర్తి, రామకృష్ణ ప్రమాదవశాత్తు నేలబావిలో పడి మృత్యువాతపడిన విషయం తెలిసిందే. వీరిలో విష్ణుమూర్తి అగ్నివీర్‌లో శిక్షణ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. వీరిని దృష్టిలో ఉంచుకుని జిల్లా మాజీ సైనికుల సంఘం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ రూ.82 వేల ఆర్థిక సాయం ఆ కుటుంబానికి శనివారం అందజేసింది. కార్యక్రమంలో చైర్మన్‌ కల్నల్‌ ఎం.టి.రాజు, అధ్యక్షుడు సువ్వారి నీలాచలం, జనరల్‌ సెక్రటరీ అమ్మాజీరావు, కిల్లి వెంకటరమణ, కింతలి రామారావు, అన్నెపు నర్సింహులు, పైడి రంగనాథం, కీర్తి సుశీల, బొడ్డేపల్లి మోహన్‌, పి.జగన్‌మోహన్‌, బి.గోవిందరావు, మల్లేశ్వరరావు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement