
అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల సత్వర పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(మీకోసం)లో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, సర్వే అండ్ లాండ్ రికార్డులు, మహిళా శిశు సంక్షేమం, విభిన్న ప్రతిభావంతులు, సర్వశిక్షా అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, ఎకై ్సజ్, ఏపీఈపీడీసీఎల్ తదితర శాఖలపై 186 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్డీఏ పీడీ కిరణ్కుమార్, జెడ్పీ సీఈవో ఎల్ఎన్వీ శ్రీధర్ రాజ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు శాఖల వారీగా ఒక్కో శాఖలో పెండింగులో ఉన్న అర్జీలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సమీక్షించారు. పెండింగులో ఉన్న అర్జీలు ఎందుకు పెండింగులో ఉన్నది అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
మీకోసంలో 186 అర్జీల స్వీకరణ
బీసీ సంక్షేమ అధికారిపై కలెక్టర్ ఆగ్రహం
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి అనురాధపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుమంది అవుట్ సోర్సింగ్ బాధిత కారుణ్య నియామక అభ్యర్థులు సోమవారం పీజీఆర్ఎస్లో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్కి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించి కలెక్టర్ ఆరు నెలలుగా కారుణ్య నియామకాలకు సంబంధించిన అభ్యర్థులను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారిపై అసహనం వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ కారుణ్య నియామకాలు మానవతా దృక్పథంతో చేపట్టాలని సూచించారు. ఒక నెల జీతం ఆపితే అప్పుడు బాధ తెలుస్తుందని విరుచుకుపడ్డారు. వెంటనే ఈ జాప్యంపై పరిశీలించి తనకు వివరించాలని కలెక్టరేట్ ఏవో సూర్యనారాయణకి ఆదేశించారు.

అర్జీల సత్వర పరిష్కారానికి చర్యలు