
డీసీఎంఎస్ చైర్మన్గా అవినాష్
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం డీసీఎంఎస్ చైర్మన్గా ఎస్ఎంపురం మాజీ సర్పంచ్ చౌదరి అవినాష్ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గతంలో ఎస్ఎంపురం సర్పంచ్గా వ్యవహరించారు. తల్లి చౌదరి ధనలక్ష్మి జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు. తండ్రి నారాయణమూర్తి (బాబ్జి) గతంలో జిల్లా టీడీపీ అధ్యక్షునిగా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా పనిచేశారు.
డీసీసీబీ చైర్మన్గా శివ్వాల
సరుబుజ్జిలి: డీసీసీబీ చైర్మన్గా సరుబుజ్జిలి మండలం షళంత్రి గ్రామానికి చెందిన శివ్వాల సూర్యనారాయణను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో జెడ్పీటీసీ, సర్పంచ్గా, ప్రస్తుతం షలంత్రి ఎంపీటీసీ సభ్యునిగా వ్యహరిస్తున్నారు. ఈయన భార్య శివ్వాల కృష్ణవేణి గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు.

డీసీఎంఎస్ చైర్మన్గా అవినాష్