
శ్రీ సత్యసాయి: యువగళం పాదయాత్రకు వచ్చిన తెలుగు తమ్ముళ్లు మద్యంమత్తులో జోగారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో మండలకేంద్రంలో మద్యం దుకాణాలు ఆదివారం కళకళలాడాయి. బత్తలపల్లిలో రెండు మద్యం దుకాణాలు ఉండగా ఒక్కరోజే దాదాపు రూ.11లక్షల వరకు వ్యాపారం జరిగింది.
మొదటి దుకాణంలో మామూలుగా ఆదివారం రోజుల్లో రూ.2.50 లక్షలయ్యేది. లోకేష్ రాకతో అది రూ.6 లక్షలకు చేరుకుంది. రెందో దుకాణంలో మామూలు రోజుల్లో రూ.3 లక్షలు వ్యాపారం జరుగుతుండగా, తమ్ముళ్ల మద్యం దాహానికి రూ.5 లక్షలకు చేరుకుంది.