భానుడి భగభగలతో విలవిల్లాడి.. వర్షమనే పేరునే మర్చిపోయిన సింహపురి వాసులకు తానున్నాననే విషయాన్ని వరుణుడు శనివారం గుర్తుచేశారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో నగరంలో ఒక్కసారిగా ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. మధ్యాహ్నం వరకు వాతావరణం కొంత చల్లగా ఉన్నా, ఆ తర్వాత ఎండ వచ్చింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు
జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద ఇలా..
నీట మునిగిన మద్రాస్ బస్టాండ్ సమీపంలోని రోడ్డు
వర్షపు నీటిలో ఇరుక్కున్న బస్సును క్రేన్ సాయంతో లాగుతూ..
చెరువును తలపిస్తున్న ఆత్మకూరు బస్టాండ్ వద్ద గల అండర్ బ్రిడ్జి


