విద్యార్థులు పోటీతత్వంతో చదవాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు పోటీతత్వంతో చదవాలి

Jan 2 2026 11:01 AM | Updated on Jan 2 2026 11:01 AM

విద్యార్థులు పోటీతత్వంతో చదవాలి

విద్యార్థులు పోటీతత్వంతో చదవాలి

వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు

వెంకటాచలం: విద్యార్థులు పోటీతత్వంతో చదవాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలో గురువారం సెంటర్‌ ఫర్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామినేషన్స్‌ను వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో ఉద్యోగాలు, వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా సమగ్ర శిక్షణతోపాటు, సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని చెప్పారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి వీఎస్‌యూకు పేరు తీసుకురావాలన్నారు. ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సునీత మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా నిపుణలచే శిక్షణ, పరీక్షలపై అవగాహన, స్టడీ మెటీరియల్‌, మాక్‌ టెస్టులు అందించనున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల లక్ష్యాలను సాధించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ విజేత, ప్రిన్సిపల్‌ సీహెచ్‌ విజయ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement