కేజీబీవీ విద్యార్థినులకు జేసీ అభినందనలు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీ విద్యార్థినులకు జేసీ అభినందనలు

Apr 29 2025 12:04 AM | Updated on Apr 29 2025 12:04 AM

కేజీబ

కేజీబీవీ విద్యార్థినులకు జేసీ అభినందనలు

నెల్లూరు రూరల్‌: ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపిన జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల విద్యార్థినులను జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌ అభినందించారు. 573 మార్కులు సాధించిన వలేటివారిపాళెం విద్యార్థిని జి.వైష్ణవి, 569 మార్కులు సాధించిన లింగసముద్రం విద్యార్థిని ఎం.అమృతప్రియ, 567 మార్కులు సాధించిన కలిగిరి విద్యార్థిని పి.మహిమకు సోమవారం కలెక్టరేట్‌లో జ్ఞాపికలు అందజేశారు.

రైల్లో నుంచి పడి

వ్యక్తి మృత్యువాత

కొడవలూరు: రైల్లో నుంచి పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కొడవలూరు రైల్వే స్టేషన్‌ సమీపంలో సోమవారం జరిగింది. రైల్వే పోలీసులు వివరాలు ఆరాతీశారు. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్పైగురి నుంచి చైన్నె సెంట్రల్‌ స్టేషన్‌కు తీసుకున్న టికెట్‌ను అతడి వద్ద గుర్తించారు.

పని నిమిత్తం వెళ్తుండగా..

ట్రాక్టర్‌ బోల్తా పడి యువకుడి మృతి

సోమశిల: ట్రాక్టర్‌ బోల్తా పడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మంగుపల్లి – చిలకలమర్రి ప్రధాన రహదారిపై సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. అనంతసాగరం మండల పరిధిలోని మంగుపల్లి గ్రామానికి చెందిన బోయిళ్ల గురుప్రసాద్‌, కృష్ణమ్మ దంపతుల పెద్ద కుమారుడు బాలప్రసాద్‌ (22) సొంత పని నిమిత్తం ట్రాక్టర్‌పై చిలకలమర్రికి వెళ్తుండగా బోల్తా పడింది. దీంతో స్థానికులు బాలప్రసాద్‌ను 108లో ఆత్మకూరుకు తరలిస్తుండగా మృతిచెందాడు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.105

సన్నవి : రూ.80

పండ్లు : రూ.50

పౌల్ట్రీ అసోసియేషన్‌ ధరలు

బ్రాయిలర్‌ (లైవ్‌) : 102

లేయర్‌ (లైవ్‌) : 100

బ్రాయిలర్‌ చికెన్‌ : 188

బ్రాయిలర్‌ స్కిన్‌లెస్‌ : 208

లేయర్‌ చికెన్‌ : 170

కేజీబీవీ విద్యార్థినులకు జేసీ అభినందనలు1
1/2

కేజీబీవీ విద్యార్థినులకు జేసీ అభినందనలు

కేజీబీవీ విద్యార్థినులకు జేసీ అభినందనలు2
2/2

కేజీబీవీ విద్యార్థినులకు జేసీ అభినందనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement