
న్యాయాధికారులకు చట్టాలపై వర్క్షాప్
నెల్లూరు (లీగల్): జిల్లా కోర్టులో శనివారం జిల్లా న్యాయమూర్తుల లిమిటేషన్ చట్టంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమన్ని రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు, రాష్ట్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి జి.సత్య ప్రభాకర్రావు, జిల్లా జడ్జి జి.శ్రీనివాస్లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు న్యాయాధికారులకు లిమిటేషన్ చట్టం, నూతన చట్టాలపై వర్క్ షాప్ను నిర్వహిస్తున్నామన్నారు. శివశంకరరావు, సత్య ప్రభాకరరావు, శ్రీనివాస్ లిమిటేషన్ చట్టంలోని అంశాల గురించి వివరించారు. చట్టాల్లోని పలు అంశాలను చర్చించారు. పలుచట్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని న్యాయమూర్తులు పాల్గొన్నారు.
పహల్గాం మృతులకు నివాళి
నెల్లూరు (స్టోన్హౌస్పేట): పహల్గాం మృతులకు నివాళిగా వాకర్స్ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ నిర్వహించి స్టేడియంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో వేలూరు రంగారావు, కనకట్ల రఘురాం ముదిరాజ్, అరిగల సాయిరాం, కిలారి తిరుపతి నాయుడు, బాసం శేషగిరిరావు, సేగు రమేష్, బలరామయ్య నాయుడు, మహిళా వాకర్స్ అధ్యక్షురాలు వసుంధర దేవి, ఫ్రెండ్స్ వాకర్స్ అధ్యక్షుడు కిలారి శ్రీనివాసులు నాయుడు, నారాయణరెడ్డి, డాక్టర్ శ్రీధర్రెడ్డి, ఒంగోలు నరసయ్య, దద్దోల రమణయ్య గౌడ్, సురేంద్ర ప్రకాష్, భాగవతుల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లపై
అధికారులతో మంత్రి ఆనం సమీక్ష
నెల్లూరు రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మకూరు పర్యటనకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. శనివారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆత్మకూరు పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్తో మంత్రి ఆనం సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ మే 1న సీం పర్యటన రూట్మ్యాప్, కార్యక్రమ వివరాలు, బందోబస్తు తదితర అంశాలను ప్రధానంగా చర్చించారు. నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కు పైలాన్ ఆవిష్కరణ, ప్రజావేదిక ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యాలయ మార్గదర్శకాల మేరకు చేపట్టాలన్నారు. నెల్లూరుపాళెం ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీ, యువతతో ముఖాముఖి ఏర్పాటు చేసే అంశాలను పరిశీలించాలన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో బందోబస్తుపై ఎస్సీతో మంత్రి చర్చించారు.
జీఓ నెం.35ను సవరించాలి
● పంచాయతీరాజ్ ఉద్యోగుల డిమాండ్
నెల్లూరు (పొగతోట): రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ద్వారా విడుదల చేసిన జీఓ నెం.35ను సవరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆ మేరకు శనివారం జెడ్పీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.35 వల్ల జిల్లా పరిషత్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 4వ తరగతి ఉద్యోగులకు గుదిబండగా మారిందన్నారు. ఆ జీవో వల్ల పనిచేస్తున్న ఉద్యోగులు అదే హోదాలో పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని వలన ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన జీవో నెం.35ను సవరించేలా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.

న్యాయాధికారులకు చట్టాలపై వర్క్షాప్

న్యాయాధికారులకు చట్టాలపై వర్క్షాప్

న్యాయాధికారులకు చట్టాలపై వర్క్షాప్