WTT Championships 2023: Manika Batra Enter 2nd Round In Women Singles - Sakshi
Sakshi News home page

World TT Championship: మనిక శుభారంభం 

May 22 2023 11:40 AM | Updated on May 22 2023 11:52 AM

World TT Championship: Manika Batra Enters 2nd Round In Women Singles - Sakshi

డర్బన్‌: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్‌ మనిక బత్రా శుభారంభం చేసింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో మనిక 11–1, 11–3, 11–2, 11–5తో లిండా లోగ్‌రైబి (అల్జీరియా)పై గెలిచి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది.

పురుషుల సింగిల్స్‌లో ఆచంట శరత్‌ కమల్, సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ కూడా రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. తొలి రౌండ్‌లో శరత్‌ కమల్‌ 11–8, 9–11, 11–9, 11–6, 11–6తో డేవిడ్‌ సెర్డారోగ్లు (ఆస్ట్రియా)పై నెగ్గగా... సత్యన్‌ 11–9, 11–8, 7–11, 11–2, 13–15, 11–13, 11–6తో టామ్‌ జార్విస్‌ (ఇంగ్లండ్‌)ను ఓడించాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో శరత్‌ కమల్‌–సత్యన్‌ ద్వయం 11–6, 11–9, 11–6తో ఎల్బెలీ–షౌమన్‌ (ఈజిప్ట్‌) జోడీపై విజయం సాధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement