IPL 2021 UAE: ఆర్సీబీకి షాక్.. గాయంతో స్టార్ ఆల్రౌండర్ ఔట్
దుబాయ్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.. చేతి వేలికి గాయం కారణంగా ఐపీఎల్-2021 మలి దశ మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆర్సీబీ కీలక ఆటగాళ్లలో ఒకడైన సుందర్ సీజన్ మొత్తానికి దూరం కావడంతో ఆ జట్టుపై ప్రభావం పడనుంది. సుందర్ స్థానంలో బెంగాల్ బౌలర్ అకాశ్దీప్కు ఆర్సీబీ యాజమాన్యం అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం ఆకాశ్దీప్ ఆర్సీబీ క్యాంప్లో నెట్ బౌలర్గా ఉన్నాడు. కాగా, సుందర్ ఇదే చేతి వేలి గాయం కారణంగా ఇంగ్లండ్ పర్యటన నుంచి అర్ధంతరంగా వైదొలిగిన సంగతి తెలిసిందే.
🔊 ANNOUNCEMENT 🔊
Washington Sundar has been ruled out of the remainder of #IPL2021 as he hasn’t fully recovered from his finger injury. Akash Deep, a state cricketer from Bengal who until now was a net bowler with RCB, has been named as Washi’s replacement. #PlayBold pic.twitter.com/azaMgkaDZp
— Royal Challengers Bangalore (@RCBTweets) August 30, 2021
ఇదిలా ఉంటే, యూఏఈ వేదికగా ఐపీఎల్ మలి దశ మ్యాచ్లు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే కొన్ని జట్లు దుబయ్ చేరుకుని ప్రాక్టీస్లో నిమగ్నమై ఉన్నాయి. ఆర్సీబీ జట్టు యూఏఈకి ఇంకా బయల్దేరాల్సి ఉంది. ఆర్సీబీ రెండో దశ షెడ్యూల్లో సెప్టెంబర్ 20న కోల్కతా నైట్ రైడర్స్తో తమ తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది.
చదవండి: చెలరేగిన యశస్వి జైస్వాల్.. ఓమన్పై ముంబై విజయం
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు