మీరే కాదు.. నేనూ మిస్సవుతున్నా : కోహ్లి | Viral Video Of Virat Kohli About I Miss MS Dhoni Too In 2nd T20 | Sakshi
Sakshi News home page

మీరే కాదు.. నేనూ మిస్సవుతున్నా : కోహ్లి

Dec 8 2020 10:15 AM | Updated on Dec 8 2020 10:46 AM

Viral Video Of Virat Kohli About I Miss MS Dhoni Too In 2nd T20 - Sakshi

సిడ్నీ : ఆదివారం ఆసీస్‌తో జరిగిన రెండో టీ 20లో టీమిండియా అభిమానులు మైదానంలో ధోని ప్లకార్డు పట్టుకొని ఉన్న ఫోటోలు  సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి. వి మిస్‌ యూ ధోని అంటూ ఫ్యాన్స్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ సమయంలో మనం కూడా అక్కడ ఉంటే బాగుండు అనిపించింది. ఒక అభిమాని మాత్రం ఈ ఘటనను మొత్తం వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ వీడియోలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కూడా అభిమానులకు మద్దతు పలకడం వైరల్‌గా మారింది.


ఆసీస్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డిండ్‌ చేస్తున్న కోహ్లి అభిమానులు పట్టుకున్న ప్లకార్డులను చూశాడు. 'మీరే కాదు.. నేనూ ధోనిని మిస్సవుతున్నా ' అంటూ వారికి సైగలు చేశాడు. కోహ్లి సైగలతో మరింత జోష్‌ నింపుకున్న అభిమానులు ధోని.. కోహ్లి.. నామస్మరణతో స్టేడియం మొత్తం హోరెత్తించారు. ధోని అంటే తనకు ప్రత్యేకమైన అభిమానం అని కోహ్లి మరోసారి చెప్పకనే చెప్పాడు. ఎంఎస్‌ ధోని సారథ్యంలో ఎంతో దూకుడుగా కనిపించిన కోహ్లి.. అతన్ని తన మెంటార్‌గా.. తన గురువుగా భావించేవాడు. అంతేకాదు కోహ్లి కెప్టెన్‌ అయిన తర్వాత కూడా ఆటలో భాగంగా విజయంపై, ఫీల్డింగ్‌ రీప్లేస్‌మెంట్‌పై ధోనితో సుధీర్ఘ చర్చలు జరిపేవాడు. అప్పట్లో వీరిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయాలు టీమిండియాకు అనేక విజయాలను కట్టబెట్టాయి. (చదవండి : టీ 20.. మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అతడే: హర్భజన్‌)

కాగా ఆసీస్‌తో జరిగిన రెండో టీ20లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను చేజెక్కించుకుంది. కాగా నామమాత్రమైన మూడో టీ20 మరికొద్ది గంటల్లో సిడ్నీ వేదికగా మొదలుకానుంది.ఒకవైపు టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తుంటే.. ఆసీస్‌ మాత్రం మ్యాచ్‌ గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement