Tokyo Paralympics: బుల్లెట్టు మరోసారి దిగింది.. షూటింగ్‌లో భారత్‌కు మరో పతకం

Tokyo Paralympics: Indian Shooter Singhraj Wins Bronze In Mens 10m Air Pistol Event - Sakshi

టోక్యో: పారాలింపిక్స్‌లో షూటింగ్‌ విభాగంలో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌(SH1) ఈవెంట్‌లో సింగ్‌రాజ్‌ అదానా కాంస్య పతకం సాధించాడు. కాగా, మహిళా షూటర్‌ అవని లేఖారా 10మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తంగా  సింగ్‌రాజ్‌ అదానా కాంస్యంతో భారత పతకాల సంఖ్య 8కి చేరింది. ఇందులో 2 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top