Tejaswin Shankar: అద్భుత ఫీట్‌.. మరో స్వర్ణం సొంతం

Tejaswin Shankar High Jumper Wins Second Gold At US Meet - Sakshi

న్యూఢిల్లీ: బిగ్‌–12 అవుట్‌డోర్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్‌ తేజస్విన్‌ శంకర్‌ పురుషుల హైజంప్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. అమెరికాలోని మ్యాన్‌హాటన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో 22 ఏళ్ల తేజస్విన్‌ కేన్సస్‌ స్టేట్‌ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహిస్తూ 2.28 మీటర్ల ఎత్తుకు ఎగిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 

ఈ టోర్నీలో తేజస్విన్‌కిది రెండో స్వర్ణం. 2019లోనూ అతను పసిడి పతకం నెగ్గగా... 2020లో కరోనా కారణంగా టోర్నీ జరగలేదు. తమిళనాడుకు చెందిన తేజస్విన్‌ 2017లో అమెరికాకు వెళ్లి కేన్సస్‌ స్టేట్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు అభ్యసిస్తూ అథ్లెటిక్స్‌ కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top