IND Vs ENG: రోహిత్‌ శర్మపై ఫ్యాన్స్‌ ఫైర్‌.. ఐపీఎల్‌ కెప్టెన్‌ అంటూ..

T20 World Cup: Team India Fans Fired Rohit Sharma And Praised MS Dhoni - Sakshi

అడిలైడ్‌: ప్రపంచకప్‌ టీ20 సెమీఫైనల్లో ఓటమిని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లండ్‌ జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వకుండా భారత్‌ పరాజయం చెందడం పట్ల ఫ్యాన్స్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ముఖ్యంగా టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను దుమ్మెత్తి పోస్తున్నారు. ట్విటర్‌లో ఫొటోలు, వీడియోలు, కామెంట్లతో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్‌ శర్మ ఐపీఎల్‌లో మాత్రమే జట్టును గెలిపిస్తాడంటూ సైటర్లు వేస్తున్నారు. 

అదే సమయంలో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనిని తలచుకుంటున్నారు. అందరి కంటే ‘మిస్టర్‌ కూల్‌’ బెటరంటూ  ప్రశంసిస్తున్నారు. దీంతో #captaincy హాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లోకి వచ్చింది. టీమిండియా కెప్టెన్సీని స్వచ్చందంగా రోహిత్‌ వదులుకోవాలని కొంతమంది సలహా ఇస్తున్నారు. 

ఈ ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడిన స్టార్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లిని కూడా అభిమానులు తెగ మెచ్చుకుంటున్నారు. ఆట పట్ల అతడి అంకితభావాన్ని ఎవరూ శంకించలేరని గట్టిగా చెబుతున్నారు. బౌలింగ్‌ బలంగా లేకపోవడం వల్లే టీమిండియా ఓడిందని కొంతమంది పేర్కొంటున్నారు. (క్లిక్: మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్‌ వాళ్లకే!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top