Sourav Ganguly: ఆఖరి టెస్టుగానే ఆడదాం.. మరో సిరీస్‌గా అనుమతించం

Sourav Ganguly Wants Postponed Old Trafford Test Fifth Test Of Series - Sakshi

లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో రద్దయిన ఆఖరి మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేస్తామని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ తెలిపారు. దీన్ని మరో సిరీస్‌గా (ఏకైక టెస్టు) అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సుదీర్ఘ సిరీస్‌ను బీమా చేసిన ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) వివాద పరిష్కారానికి ఐసీసీ తలుపు తట్టింది. దీన్ని నిశితంగా గమనించిన బీసీసీఐ అసంపూర్తి సిరీస్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమని తెలిపింది. 

చదవండి: ఐదో టెస్టు భవితవ్యం మీరే తేల్చండి

కోహ్లి ప్రతిపాదనను తిరస్కరించిన ఈసీబీ.. 22న యూకేకు గంగూలీ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top