రష్మిక జోడీ శుభారంభం  | Rashmika Jodi is off to a good start | Sakshi
Sakshi News home page

రష్మిక జోడీ శుభారంభం 

Mar 6 2024 4:17 AM | Updated on Mar 6 2024 4:17 AM

Rashmika Jodi is off to a good start - Sakshi

నాగ్‌పూర్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి  రష్మిక డబుల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో రష్మిక–వైదేహి (భారత్‌) ద్వయం 6–2, 6–1తో సౌజన్య బవిశెట్టి (భారత్‌)–మె హసెగావా (జపాన్‌) జంటను ఓడించింది. సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సౌజన్య బవిశెట్టి, హుమేరా బహార్మస్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయారు.  

Advertisement
 
Advertisement
Advertisement