‘అమ్మాయిల ఆటకు డబ్ల్యూపీఎల్తో అందలం’
దేశంలో మహిళా క్రికెటర్ల కలలు సాకారమయ్యేందుకు డబ్ల్యూపీఎల్ దోహదం చేస్తుందని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ అన్నారు. ‘మరెంతో మంది యువ క్రీడాకారిణిలు క్రికెట్వైపు మళ్లేందుకు, కెరీర్గా ఎంచుకునేందుకు డబ్ల్యూపీఎల్ ఉపయోగపడుతుంది.
ఇందులో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. తొలి మ్యాచ్లో తమ ఫ్రాంచైజీ భారీ విజయం సాధించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నా’ అని నీతా అంబానీ వ్యాఖ్యానించారు.
సంబంధిత వార్తలు