Malaysia Masters: లక్ష్య సేన్, ప్రణయ్‌ సంచలనం

Malaysia Masters: HS Prannoy, Lakshya Sen Enter 2nd Round With Sensational Wins - Sakshi

ప్రపంచ నాలుగో ర్యాంకర్, ఆరో ర్యాంకర్‌లపై విజయం

ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సింధు, శ్రీకాంత్‌  

కౌలాలంపూర్‌: మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు హెచ్‌ఎస్‌ ప్రణయ్, లక్ష్య సేన్‌  సంచలన విజయాలతో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 16–21, 21–14, 21–13తో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ తియెన్‌ చెన్‌ చౌ (చైనీస్‌ తైపీ)పై... ప్రపంచ 23వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–10, 16–21, 21–9తో ప్రపంచ నాలుగో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత లో కీన్‌ యె (సింగపూర్‌)పై గెలుపొంది ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు.

ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ (భారత్‌) 21–12, 21–16తో తొమా జూనియర్‌ పొపోవ్‌ (ఫ్రాన్స్‌)ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో పీవీ సింధు 21–13, 17–21, 21–18తో లైన్‌ క్రిస్టోఫర్సన్‌ (డెన్మార్క్‌)పై కష్టపడి విజయం సాధించింది. భారత్‌కే చెందిన అషి్మత 17–21, 7–21తో యు హాన్‌ (చైనా) చేతిలో, ఆకర్షి 17–21, 12–21తో అకానె యామగుచి (జపాన్‌) చేతిలో, మాళవిక బన్సోద్‌ 11–21 13–21తో జి యి వాంగ్‌ (చైనా) చేతిలో ఓడిపోయారు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top