సీఎస్‌కేలో కరోనా కలకలం: మరో ప్లేయర్‌కు పాజిటివ్‌

IPL 2020: Ruturaj Gaikwad Tests positive for Coronavirus - Sakshi

చెన్నై సూపర్‌కింగ్స్(సీఎస్‌కే)ను కరోనా మమహ్మారి పట్టి పీడిస్తోంది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం యూఏఈకి వెళ్లిన ఆ జట్టులో ఇప్పటికే ఒక బౌలర్‌తో పాటు పదిమంది కరోనా బారిన పడగా, తాజాగా మరో ఆటగాడికి కూడా ఈ మహమ్మారి సోకింది. సీఎస్‌కే యువ ఓపెనర్‌ రుతురాజ్ గైక్వాడ్‌ కరోనా వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది.(చదవండి : చెన్నైకి భారీ షాక్‌.. ఐపీఎల్‌ నుంచి రైనా ఔట్‌)

జట్టు సభ్యులకు కరోనా సోకడంతో నాల్గొసారి అందరికీ కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. దాంట్లో రుతురాజ్‌ గైక్వాడ్‌కు పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. దీంతో సీఎస్‌కేలో కరోనా బాధితుల సంఖ్య 12కు చేరింది. మరోవైపు సీఎస్‌కే మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ఐపీఎల్‌ 2020 నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ మొత్తానికీ సురేశ్ రైనా దూరమైనట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ సీఈవో కేఎస్ విశ్వనాథన్ ప్రకటించాడు.
(చదవండి : కరోనా ‘ఆట’ మొదలైంది! )

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top