Womens Asia Cup 2022: థాయ్‌లాండ్‌పై విజయం.. ఆసియాకప్‌ ఫైనల్లో టీమిండియా వుమెన్స్‌

India Women Won-By 74 Runs Vs Thailand Womens Enters Asia Cup Final - Sakshi

మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నీలో టీమిండియా వుమెన్స్‌ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్‌ 74 పరుగులతో ఘన విజయం సాధించింది.

149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్‌ వుమెన్స్‌ భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 74 పరుగులే చేయగలిగింది. థాయ్‌లాండ్‌ బ్యాటర్లలో నరుమోల్‌ చవాయి 21, నట్టాయా బుచాతమ్‌ 21 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్‌ రెండు, షఫాలీ వర్మ, స్నేహ్‌ రాణా, రేణుకా సింగ్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా వుమెన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 42 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 36 పరుగులు, జేమీమా రోడ్రిగ్స్‌ 27 పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక వుమెన్స్‌, పాకిస్తాన్‌ వుమెన్స్‌ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో టీమిండియా వుమెన్స్‌ ఫైనల్లో తలపడనుంది. ఆసియా కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 15న(శనివారం) జరగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top